కేసీఆర్ ప్రభుత్వంపై రఘునందన్ రావు ఘాటు వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
కేసీఆర్ ప్రభుత్వంపై రఘునందన్ రావు ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు సర్కార్ భూములను విక్రయించాలనే నిర్ణయంపై ఆయన ఘాటుగా స్పందించారు. గత ప్రభుత్వాలు భూమిలేని పేద వాళ్లకు భూమిని పంచితే ప్రస్తుత ప్రభుత్వం భూములను లాక్కోవడం దివాలాకోరుతనానికి నిదర్శనం అన్నారు. గురువారం ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. ఇప్పటికే ప్రాజెక్టులు, రోడ్ల వెడల్పు, ఇండ్ల స్థలాల కోసం అంటూ అసైన్డ్ భూములను పేదవాడి నుంచి దూరం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ భూములను అమ్మి స్కీములు అమలు చేయడం గొప్పా అని ప్రశ్నించారు. పేదవాడికి భూమి లేకుండా ఉండాలా అని నిలదీశారు


Next Story